నేటి వారధి న్యూస్ (ప్రతినిధి)
ఖమ్మం జిల్లా: కూసుమంచి మండలం గ్రామంలో అయ్యప్ప సాములు మాల ధారణ చేశారు. మాల ధారణ తొలి రోజు పురస్కరించుకుని కూసుమంచి గ్రామంలో కార్తిక మాసం సందర్భంగా వెంకట్ నారాయణ (అయ్యప్ప) గురుస్వామి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా కూసుమంచి గ్రామంలో మంద నాగులు విజయమ్మ వారి కుటుంబ సభ్యులు ఆధ్వర్యంలో
స్వాములకు అన్నదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… అయ్యప్ప మాలధారణ అనేది భక్తి, నియమాలు, శుద్ధతకు ప్రతీకగా నిలుస్తుందని పేర్కొన్నారు. భక్తులు భవాని స్వామి నియమాలు పాటించి విజయవంతంగా దైవ దర్శనానికి వెళ్లాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మంద నాగులు విజయమ్మ మంద మధు స్వర్ణ మంద జానకి రామ్ కన్య సామి ప్రసన్న మంద మోహన్ రావు నళిని చిన్న నవీన్ నరాటి వెంకన్న రమేష్ వెంకటేష్ బెల్లంకొండ రనిల్ మమత సరూప ఉపేందర్ నరేష్ కిష్టాపురం గ్రామస్తులు అయ్యప్ప స్వాములు భక్తులు తదితరులు పాల్గొన్నారు
కూసుమంచిలో అయ్యప్ప స్వాములకు అన్నదానం
- Advertisment -
- Advertisment -
RELATED ARTICLES
- Advertisment -

