ముమ్మరంగా గాలిస్తున్న అగ్నిమాపక శాఖ అధికారులు
నేటి వారధి న్యూస్ (ప్రతినిధి)
మదనపల్లి మండలంలోని పోతపోలు గ్రామం, జబ్బల క్వారీ లో 14 ఏళ్ల మహమ్మద్ అన్నాస్ ప్రమాదవశాత్తు పడిపోయాడు. సోమవారం ఉదయం సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక అధికారి శివప్ప తన సిబ్బందితో వెళ్లి ముమ్మరంగా గాలిబచ్చేర్లు చేపట్టారు. ప్రస్తుతం బాలుడి ఆచూకీ లభించకపోవడంతో శోధన కార్యకలాపాలు కొనసాగుతున్నాయని అగ్నిమాపక అధికారి తెలిపారు. అయితే ముమ్మర గాలింపు చర్యల కోసం ఆపరేషన్ను దృష్టిలో ఉంచుకుని, మహమ్మద్ అన్నాస్ను గుర్తించడానికి తమ సిబ్బంది పనిచేస్తున్నట్లు తెలిపారు.

