Saturday, April 4, 2026

తోరూర్ పట్టణం లో షీ టీమ్స్ పకడ్బంధిగా ఏర్పాటు చేయాలి

- Advertisment -

నేటి వారధి న్యూస్
ఎస్ఎఫ్ఐ మహబూబాబాద్ జిల్లా కార్యదర్శి పట్ల మధు, జిల్లా గర్ల్స్ నాయకురాలు శ్రీగిరి రేణుక ఎస్ఎఫ్ఐ తొర్రూరు మండల కమిటీ ఆధ్వర్యంలో తొర్రూర్ సి.ఐ గణేష్ కు వినతిపత్రం అందజేత తోరూర్ పట్టణం లో షీ టీమ్స్ ని పకడ్బందీగా ఏర్పాటు చేయాలని ఎస్ఎఫ్ఐ మహబూబాబాద్ జిల్లా కార్యదర్శి పట్ల మధు, జిల్లా గర్ల్స్ నాయకురాలు శ్రీగిరి రేణుక డిమాండ్ చేశారు ఈ సందర్భంగా తొర్రూర్ మండల కమిటీ ఆధ్వర్యంలో తొడూరు సిఐ గణేష్ కు వినతిపత్రం అందజేశారు అనంతరం వారు మాట్లాడుతూ తొరూర్ పట్టణ కేంద్రంలోని రిక్షా కాలనీ వైపు గర్ల్స్ హాస్టల్స్ మరియు పాఠశాలలో ఉండడంవల్ల అబ్బాయిలు నిత్యం అటువైపు తిరుగుతూ విద్యార్థినిలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని తెలియజేశారు.. పట్టణ కేంద్రంలోని బస్టాండ్ లో సాయంత్రం కాగానే బస్టాండ్ కొచ్చే విద్యార్థినిలను ఆకతాయిలు తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని అన్నారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం షీ టీమ్స్ పకడ్బందీగా అమలు చేస్తామని చెబుతున్న తోరూర్ పట్టణ కేంద్రంలో సరిగా అమలు కావడం లేదని విమర్శించారు కావున పోలీసు ఉన్నతాధికారులు స్పందించి తక్షణమే నేటి నుండి పట్టణ కేంద్రంలో ప్రత్యేక పెట్రోల్ అని సిఐని కోరారు ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ మహబూబాబాద్ జిల్లా నాయకులు గుండ్ల రాకేష్ తోరూర్ మండల ఉపాధ్యక్షులు మహేష్ మండల నాయకులు త్రిష సందీప్ రిషి మహేష్ ప్రవీణ్ ప్రమోద్ వినోద్ తదితరులు పాల్గొన్నారు

- Advertisment -
RELATED ARTICLES
- Advertisment -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

- Advertisment -