Friday, April 3, 2026

భద్రాచలం శ్రీరామనవమి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై సమీక్ష

- Advertisment -

నేటి వారధి న్యూస్
భద్రాచలం వచ్చేనెల 6న జరగబోయే శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు మరియు సీతారాముల కళ్యాణం ఏర్పాట్లపై భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు సబ్ కలెక్టర్ భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు శ్రీరామనవమి రోజున లక్షకు పైగా భక్తులు భద్రాచలానికి రావచ్చని అంచనా కాబట్టి వారికి అవసరమైన సౌకర్యాలను సమయానికి అందుబాటులోకి తేవాలని కలెక్టర్ ఆదేశించారు ప్రధాన ఏర్పాట్లు చలివేంద్రాలు వేసవి దృష్టిలో ఉంచుకొని భక్తుల కోసం నీటి సదుపాయాలతో చలివేంద్రాలు ఏర్పాటు చేయాలి.తాత్కాలిక మరుగుదొడ్లు భక్తుల సంఖ్య ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో తాత్కాలిక మరుగుదొడ్లు ఏర్పాటు చేయాలి మిథిలా స్టేడియంలో భద్రత కళ్యాణం జరిగే మిథిలా స్టేడియంలో భద్రతా చర్యలు పటిష్టంగా చేపట్టాలని ఆదేశించారు.ఎల్ఈడీ స్క్రీన్లు భక్తులందరికీ కల్యాణ దర్శనం సులభంగా కల్పించేందుకు వివిధ ప్రాంతాల్లో భారీ ఎల్ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.భద్రత & వీఐపీ ఏర్పాట్లు.రాష్ట్ర ముఖ్యమంత్రి సహా పలు ప్రముఖులు హాజరవ్వొచ్చని, అందువల్ల పోలీస్ శాఖ భారీ బందోబస్తు ఏర్పాటు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. భక్తుల రద్దీని క్రమబద్ధంగా .నిర్వహించేందుకు సెక్టరైజేషన్ పద్ధతిలో భద్రతా ఏర్పాట్లు చేపట్టాలని సూచించారు.అన్ని ఏర్పాట్లు ఏప్రిల్ 1వ తేదీ నాటికి పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.

- Advertisment -
RELATED ARTICLES
- Advertisment -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

- Advertisment -