విద్యార్థులే ఉపాధ్యాయులైన వేళ ఖమ్మం రూరల్ ఖమ్మం రూరల్ మండలం మంగళ గూడెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో స్వయం పరిపాలన దినోత్సవం మంగళవారం నాడు నిర్వహించారు చిట్టుపట్టు చిన్నారులు పెద్దవాళ్ల వలె వస్త్రాలను ధరించి ఉపాధ్యాయ పాత్రను పోషించారు ఉపాధ్యాయుల వలె పాఠ్యాంశాలను బోధించి శభాష్ అనిపించుకున్నారు ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయురాలుగా కే గౌతమి వ్యవహరించగా జగదీష్ వరుణ్ తేజ మీనాక్షి అక్కికోటేశ్వరి స్పర్శ వర్షిత కళ్యాణి గాయత్రి భార్గవి త్రివేణి తదితరు లు పాల్గొన్నారు. అనంతరం ఏర్పాటుచేసిన సభలో ప్రధానోపాధ్యాయులు బి శ్రీనివాసరావు మాట్లాడుతూ విద్యార్థులు తమ బాధ్యతను ఎరిగి పనిచేయాలని సూచించారు విద్యార్థులకు క్రమశిక్షణ ముఖ్యమని చెప్పారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు శ్రీనివాస్ రావు నాగిరెడ్డి ఐలయ్య శ్రీనివాస్ డివిఎన్ రెడ్డి శ్రీదేవి తదితర ఉపాధ్యాయులు పాల్గొన్నారు


