నేటి వారధి న్యూస్
జిల్లా ఎస్పీ కె.పి.ఎస్. కిషోర్ మాట్లాడుతూ జిల్లాలో ఉన్న 141 మధ్యం దుకాణాల్లో ఏర్పాటు చేసిన సిసి కెమేరాలను జిల్లా పోలీస్ కార్యాలయం, కలెక్టరేట్ కమాండ్ కంట్రోల్ రూం కు అనుసంధానం అయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. నాటుసారా సరఫరాను పూర్తిగా నిరోధించేందుకు ముఖ్యంగా అటవీ ప్రాంతంలో నాటుసారా తయారీపై డ్రోన్ల ద్వారా తనిఖీలు చేసేందుకు డ్రోన్ సమకూర్చాలని చేయాలని సూచించారు. దేవాలయాలు, ఆసుపత్రులు లేదా పాఠశాలలకు 100 మీటర్ల పరిధిలో మద్యం దుకాణాలు ఉంటే వాటి సమాచారాన్ని అందజేయాలన్నారు. గతంలో నాటుసారా తయారుచేసే వారి కుటుంబ సభ్యులకు ఎల్డిఎం ఆధ్వర్యంలో బ్యాంకర్ల ద్వారా ఉపాధి కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు
ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

