Friday, April 3, 2026

తిరుమలలో రామచంద్రు పదవి కోసం మొక్కును చెల్లించుకున్న తమ్ముడు లక్ష్మణుడు.

- Advertisment -

నేటి వారధి న్యూస్
తిరుపతి వెంకటేశ్వర స్వామి సన్నిధిలో రామచంద్రుని పదవి కోసం మొక్కు చెల్లించుకున్న బానోత్ లక్ష్మణ్ నాయక్. మహబూబాబాద్ జిల్లా కురవి మండలానికి చెందిన మాజీ వార్డ్ నెంబర్ సీనియర్ కాంగ్రెస్ పార్టీ గిరిజన నాయకులు బానోత్ లక్ష్మణ్ నాయక్ లు తెలంగాణ రాష్ట్ర శాసనసభ డిప్యూటీ స్పీకర్ గా డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ రామచంద్రనాయక్ పదవి రావడంతో తిరుపతి వెంకటేశ్వర స్వామి సన్నిధిలో వారి కుటుంబ సభ్యులతో సహా స్వామివారికి తలనీలాలు సమర్పించుకోవడం జరిగింది.ఈ సందర్భంగా లక్ష్మణ్ నాయక్ మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్రంలోనే వరంగల్ ఉమ్మడి జిల్లా మరియు మహబూబాద్ పరిసర ప్రాంతాల్లోని గిరిజనులు ఎక్కువగా ఉన్నామన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహబూబాద్ పరిసర ప్రాంతాల్లోనే లంబాడి గిరిజనులు ఎక్కువ ఉండడం తో గతం 10 సంవత్సరాలుగా బిఆర్ఎస్ గిరిజన ప్రాంతమైన మహబూబాద్ జిల్లా అభివృద్ధిలోచుకోక అందులో డోర్నకల్ నియోజకవర్గం అభివృద్ధిలో అట్టడుగున ఉందన్నారు. గత ప్రభుత్వం చేసిన తప్పులు ఈ ప్రభుత్వం గెలిచినాక తమ భుజాల మీద వేసుకున్న రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ప్రజలకు అన్యాయం చేయాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే పేదల పక్షామని రేవంత్ రెడ్డి ఈ ప్రాంతాన్ని తన దృష్టిలో పెట్టుకొని డోర్నకల్ గిరిజన ఎమ్మెల్యే అయిన రామచంద్రనాయక్ 53 వేల ఓట్లతో భారీ మెజార్టీతో గెలిచిన రామచంద్రనాయక్ ఏ పదవి ఇచ్చినా తక్కువేనని తనకి రాష్ట్ర శాసనసభ డిప్యూటీ స్పీకర్ గా నియమించడం పట్ల డోర్నకల్ గిరిజన ప్రజలు హర్షం వ్యక్తం చేశామని ఉన్నారు. త్వరలో ఆరు నెలలో గిరిజన ఎమ్మెల్యే అయిన రామచంద్రనాయక్ మంత్రి పదవి వస్తుందని అది దృష్టిలో పెట్టుకొని తిరుమల తిరుపతి లోని డోర్నకల్ ఎమ్మెల్యే రామచందర్ నాయక్ డోర్నకల్ నియోజకవర్గ అభివృద్ధి ని తెలంగాణ రాజధాని అయిన హైదరాబాదు అభివృద్ధి ఎలా జరిగిందో దానికి భిన్నంగా మహబూబాద్ జిల్లా డోర్నకల్ తలపించేలా వారు కృషిచేసి ఈ ప్రాంతాన్ని 100% అభివృద్ధి ప్రాంతంగా తీర్చిదిద్దాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని అన్నారు. 10 సంవత్సరాలు చేయని బీఆర్ఎస్ ప్రభుత్వం ఐదు సంవత్సరాల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వ తెలంగాణ రాష్ట్రాన్ని చక్కదిద్దే విధంగా శాయశక్తుల కృషి చేస్తుందని వారన్నారు. మహబూబాద్ జిల్లా డోర్నకల్ నియోజకవర్గం కార్యకర్తలు ప్రజలు సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని తిరుపతిలో శ్రీ వెంకటేశ్వర స్వామిని వేడుకున్న బానోత్ లక్ష్మణ్ నాయక్.

- Advertisment -
RELATED ARTICLES
- Advertisment -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

- Advertisment -