నేటి వారధి న్యూస్ (ప్రతినిధి)
హైదరాబాద్ :ఉచితంగా విద్యుత్ సరఫరా చేస్తామని గణేష్ మండపాలకు పొన్నం ప్రభాకర్ స్పష్టం.అట్టహాసంగా నిర్వహించుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ సూచనలుభాగ్యనగరంలో వినాయక చవితి వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు తెలంగాణ సర్కార్ సిద్ధమైంది. ఆగస్టు 27న వినాయక చవితి పండుగ. ఈ క్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్.. నగరంలో గణేష్ నవరాత్రి ఉత్సవాల నిర్వహణపై.. అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నగరంలోని గణేష్ మండపాలకు ఉచిత విద్యుత్ సరఫరా చేస్తామని తెలిపారు. అలానే వినాయక నిమజ్జనం కోసం ప్రభుత్వం 30 కోట్ల రూపాయల నిధులు కేటాయించిందని తెలిపారు. ఆ వివరాలు త్వరలోనే అతిపెద్ద పండుగ వినాయక చవితి రాబోతుంది. ఆగస్టు 27న గణేష్ చతుర్థి పర్వదినం. ఇక బొజ్జ గణపయ్య పండుగ అంటే హైదరాబాద్లో సంబరాలు మాములుగా ఉండవు. గల్లీగల్లీకో వినాయకుడు కొలువు దీరి భక్తుల సేవలు అందుకుంటాడు. తొమ్మిది రోజుల భక్తుల సేవలతో తరించిన అనంతరం గంగమ్మ తల్లి ఒడికి చేరుకుంటాడు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు
గణేష్ మండపాలకు పొన్నం వరం
- Advertisment -
- Advertisment -
RELATED ARTICLES
- Advertisment -

