జవహర్ లాల్ నెహ్రు రికార్డును అధిగమించిన మోదీ
నేటి వారధి న్యూస్ ప్రతినిధి
ఢిల్లీ :ప్రధాని నరేంద్ర మోదీ నేటితో సరికొత్త చరిత్ర సృష్టించారు. అత్యధిక కాలం (4,399 రోజులు) పదవిలో కొనసాగిన ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన ప్రధానిగా రికార్డుకెక్కారు. దీంతో భారత తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ పేరిట ఉన్న రికార్డు.(4,398 రోజులు) బద్దలైంది. నెహ్రూ మొత్తం 6,130 రోజులు ప్రధానిగా పనిచేసినప్పటికీ, 1947 ఆగస్టు 15 నుండి దేశంలో తొలి సాధారణ ఎన్నికలు ముగిసేవరకు (1952 మే 12) ఆయన ఎన్నిక కాకుండానే పదవిలో ఉన్నారు. దేశ తొలి ఎన్నికల తర్వాతే ఆయన ‘ఎలెక్టెడ్ పీఎంగా’ బాధ్యతలు చేపట్టారు..

