Saturday, August 1, 2026

వృద్ధ అనాథాశ్రమంలో అన్నదానం పండ్ల పంపిణీ టీజేఏ 12వ ఆవిర్భావ దినోత్సవాన్ని సేవా కార్యక్రమాలతో ఘనంగా నిర్వహించిన జర్నలిస్టులు

- Advertisment -


వృద్ధుల ముఖాల్లో చిరునవ్వులు నింపిన మానవతా కార్యక్రమం

నేటి వారధి
మహబూబాబాద్, ప్రతినిధి
తెలంగాణ జర్నలిస్టు అసోసియేషన్ (టీజేఏ) 12వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని మహబూబాబాద్ జిల్లా శనిగపురంలోని వృద్ధ అనాథాశ్రమంలో సేవా కార్యక్రమాలను ఘనంగా నిర్వహించింది. జిల్లా అధ్యక్షుడు మేకరబోయిన నాగేశ్వర్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఆశ్రమంలోని వృద్ధులకు అన్నదానం నిర్వహించడం తో పాటు పండ్లను పంపిణీ చేసి, వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు నాగేశ్వర్ మాట్లాడుతూ సమాజానికి సేవ చేయడం ప్రతి ఒక్కరి బాధ్యత అని, జర్నలిస్టులు వార్తలను ప్రజలకు చేరవేయడమే కాకుండా మానవతా విలువలను కాపాడుతూ సామాజిక బాధ్యతను కూడా నిర్వర్తించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. టీజేఏ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుల పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఆవిర్భావ దినోత్సవాన్ని సేవా కార్యక్రమాలతో నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
అనంతరం వృద్ధులకు స్వయంగా భోజనం వడ్డించి, పండ్లను అందజేసిన టీజేఏ జిల్లా అధ్యక్షుడు నాగేశ్వర్‌తో పాటు సంఘ సభ్యులకు ఆశ్రమ నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు. జర్నలిస్టులు సమాజం పట్ల తమ బాధ్యతను సేవా రూపంలో చాటుకోవడం అభినందనీయమని కొనియాడారు.సేవాభావం, మానవత్వం, సామాజిక బాధ్యతకు ప్రతీకగా నిలిచిన ఈ కార్యక్రమం ఆశ్రమంలో ఆప్యాయత పూరిత వాతావరణాన్ని నెలకొల్పింది. ఆర్భాటాలకు దూరంగా సేవను ప్రధానంగా తీసుకొని ఆవిర్భావ దినోత్సవాన్ని నిర్వహించిన టీజేఏ జిల్లా శాఖ సమాజానికి ఆదర్శంగా నిలిచిందని పలువురు అభిప్రాయపడ్డారు.
ఈ కార్యక్రమంలో టీజేఏ జిల్లా అధ్యక్షుడు మేకరబోయిన నాగేశ్వర్, జర్నలిస్టులు ఇండ్ల మహేష్, శ్రీనివాస్, గుగులోతు లింగ్య, ఎండి జాకీర్ హుస్సేన్, నల్ల జగన్ రెడ్డితో పాటు జిల్లా నాయకులు, సంఘ సభ్యులు, ఇతర జర్నలిస్టులు పాల్గొన్నారు.

- Advertisment -
RELATED ARTICLES
- Advertisment -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

- Advertisment -